Nara Chandrababu Naidu

Nara Chandrababu Naidu Instagram – రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఉదయం 7 గంటల నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి ఓట్లు వేయడంపై వారికి నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నా. ఇప్పుడు సాయంత్రం 5 కావస్తుంది….ఉదయం 7 గంటలకు ఎంత పెద్దఎత్తున ఓటర్లు పోలింగ్ స్టేషన్లలో ఉన్నారో….పోలింగ్ ముగిసే ఈ సమయంలో కూడా అంతే ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. ప్రజలు ఓటింగ్ పై ఇంత ఉత్సాహం చూపడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం. ఆ వర్గం ఈ వర్గం అని లేదు…అన్ని వర్గాలు వచ్చి ఓటేస్తున్నారు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేదు…అన్ని ప్రాంతాల్లో అదే జోరు కనిపిస్తోంది. మాచర్ల, నర్సారావుపేట వంటి చోట్ల ఓటమి భయంతో వైసీపీ హింసకు పాల్పడింది. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనం పైనే వైసీపీ గూండాలు దాడి చేశారు. అదే విధంగా నర్సారాపుపేట లోక్ సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. మరోవైపు తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే ఓటరుపై చేయి చేసుకున్నారు. ఇంత స్థాయిలో హింస జరిగినా ప్రజలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఇంకా పోలింగ్ కేంద్రాలకు వస్తూనే ఉన్నారు. ఈ చైతన్యం, ఈ సంకల్పం చూస్తుంటే…ఈ రోజు రాత్రి వరకు కూడా పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఓటు వేయ్యాలనే ప్రజల ఈ సంకల్పం రాష్ట్రానికి మేలు చేస్తుంది. గత ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ జరిగింది….ఈ ఏడాది ఇప్పుడున్న జోరు చూస్తే 85 శాతం పైగా పొలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. దీన్ని కూటమి స్వాగతిస్తోంది. 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉండే ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు తమ తీర్పును ఇవ్వాలని విజ్ఝప్తి చేస్తున్నాను. నేటి మీ ఓటు….రేపటి మీ భవితకు బంగారు బాట అవుతుంది. స్వేచ్చ, స్వాతంత్య్రం .. కనీస హక్కులతో కూడిన గౌరవ ప్రదమైన జీవితాన్ని మీకు అందించేది ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని మీ ఓటుతో కాపాడండి.
#VoteForAlliance #CycleisComing #YCPAntham #TDPJSPBJPWinningAP | Posted on 13/May/2024 17:00:28

Nara Chandrababu Naidu
Nara Chandrababu Naidu

Check out the latest gallery of Nara Chandrababu Naidu